ముగ్గురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

సుమారు 20 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, ఒక టీవీ,ఫోన్ ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం

భూపాలపల్లి నేటిధాత్రి

అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి
బంగారం, వెండి ఆభరణాలు, బైక్ లు, LED TV, సెల్ ఫోన్ వీటి మొత్తం విలువ. Rs.20,05,800/- (ఇరవై లక్షల ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు) స్వాధీనం చేసుకున్న కాటారం పోలీసులు.

దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్ కు సంబందించి వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పి కిరణ్ ఖరే మిడియాకు తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల వివరములు ఇలా ఉన్నాయి
A-1) తాటికొండ స్వామి చరణ్ @ మున్నా, s /o రమేశ్ వ: 19 సం , కులం : sc మాదిగ , Labour, r/o : గాంధీనగర్ మంచిర్యాల
A-2) కురాసేనగా ఈశ్వర్ s/o భీంరావ్, వయస్సు: 19 సం,,లు, కులం: గాండ్ల, నివాసం: తిర్యాని, ఆసిఫాబాద్ జిల్లా
A-3)పనేం రాజేశ్ S/o సురేష్, వయస్సు: 28 సం,,లు, కులం: ముధీరాజ్ , నివాసం: సిరోoచ, గడ్చిరోలి, మహారాష్ర్ట, ప్రస్తుత నివాసం, రాజివ్ నగర్, మంచిర్యాల,
నిందితుల వద్ద నుండి స్వాధీన పరుచుకున్న వాటి వివరాలు
1) బంగారం ఆభరణాలు -17.3 తులలు (పదమూడు లక్షల యనభై నాలుగు వేల రూపాయలు )
2) వెండి ఆభరణాలు -83 తులలు
3) బైక్ -6
4) LED TV,-1
5) సెల్ ఫోన్ -1
మొత్తం విలువ… 20,05800/-….

ఎస్పీ కిరణ్ ఖరే గారు తెలిపిన వివరాల ప్రకారం కాటారం మండలం శంకరంపల్లి గ్రామంలో 27- 10- 2024 రోజున రాత్రి సమయంలో దొంగతనం జరగగా, బాధితుల ఫిర్యాదు మేరకు కాటారం పోలీసులు కేసు నమోదు చేసి, డిఎస్పి రామ్మోహన్ రెడ్డి సీఐ నాగార్జున రావు ఆధ్వర్యంలో మూడు టీములుగా ఏర్పడి విచారణ కొనసాగించగా, గంగారం ఎక్స్ రోడ్ వద్ద గల సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించడం జరిగింది.

నిందితులు
మహారాష్ట్రలోని చంద్రాపూర్ దగ్గర రాజురా గ్రామం, ఘనపురం మండలంలోని చెల్పూర్, కొయ్యర్ గ్రామం , హన్మకొండ సుబేదారి, మంథనిలోని గుంజమడుగు, పసరా కాటారం, పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ దొంగతనాలకు పాల్పడి, బంగారు, వెండి ఆభరణాలను మోటర్ సైకిల్ల ను రాత్రి పూట దొంగిలించేవారు. దొంగిలించిన సొత్తును అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. కాటారం మండలం శంకరంపల్లి లో దొంగతనం చేసిన సొత్తును, చోరీ చేసిన రెండు బైక్ లపై ముగ్గురు నిందితులు ములుగు జిల్లా ప్రసాలో దొంగిలించిన సొత్తు, బైక్ లు అమ్మడానికి వెళుతుండగా కాటారం సిఐ నాగార్జున రావు, కాటారం ఎస్సై అభినవ్, సిబ్బంది ఆధ్వర్యంలో మద్దులపల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. వీరిని విచారించగా వారు ఇంతకు ముందు చేసిన దొంగతములను ఒప్పుకున్నారు.
మహారాష్ట్ర రాస్ట్రంలో రాజుర లో హోండా షైన్ బైక్ , ఘనపురంలోని చెల్పూర్ లో యమహా rx -100 బైక్ , కొయ్యర్ గ్రామం లో హీరో బైక్, అదాలత్ డీ మార్ట్ ఎదురుగా ఒక షాప్ ముందు పార్క్ చేసిన కొత్త స్పెండర్ బైక్, మంథనిలో గుంజపడుగు గ్రామంలో ఇంటి ముందు ఉన్న పల్సర్ బైక్ ను, కాటారం మండలం శంకరం పల్లి లో దొంగిలించిన ఎల్ఈడి టీవీ ని ఒకదాని వెనుక ఒకటినిని దొంగలించి మంచిర్యాలలోని నిందితుడైన స్వామి చరణ్ ఇంటి వద్ద దాచి పెట్టగా, కాటారo పోలీసులు, పైన తెలిపిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఫై నిందితులపై గతంలో పలు కేసులు నమోదు అయినట్లు తెలిపినారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ ఖరే గారు మాట్లాడుతూ నేరాలనియంత్రంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటులో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కేసు చేధనలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సిఐ నాగార్జున రావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, కాటారం ఎస్సై అభినవ్, అడివి ముత్తారం ఎస్సై మహేందర్, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ రాజకుమార్, సిబ్బంది శీను, లక్ష్మిరాజ్, హరి, హరీష్, ప్రసాద్, జగన్, లవన్, ఐటీ కోర్ వేణు, హోంగార్డులు తిరుపతి హోంగార్డు రాజయ్య ఐటీ కారు వేణు, హోంగార్డు రాజయ్యను ఎస్పి అభిందించి, నగదు అందించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version