గంగారం, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా ములుగు అసెంబ్లీ నియోజకవర్గం గంగారాం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ఆదేశాల మేరకు ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ,మండల నాయకులు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు అన్ని గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు , బూత్ కమిటీ అధ్యక్షులు, యూత్” యువజన సంఘం నాయకులు, కిసాన్ సేల్ విభాగం, విద్యార్థి విభాగం మహిళలు, ఎన్ రోలర్స్, సోషల్ మీడియా విభాగం, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీతక్క అభిమానులు ప్రతి ఒక్కరు చాలా ప్రాముఖ్యతతో కూడిన ఈ వేడుకలలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొని ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కాగలరని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు అన్నారు..