ఓరుగల్లు శ్రీ భద్రకాళి భద్రేశ్వర్ల తెప్పోత్సవంలో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర

 

ఓరుగల్లు భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా దసరా పండుగ రోజు హంస వాహన తాటకం మీద నిర్వహించే జలక్రీడ తెప్పోత్సవం కార్యక్రమం అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శాశ్వత దాతగా ప్రతి సంవత్సరం వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్నారు అదేవిధంగా ఈరోజు జరిగిన తెప్పోత్సవ పూజా కార్యక్రమంలో భద్రకాళి భద్రేశ్వర్ల దేవతమూర్తుల విగ్రహాలను హంస వాహనాన్ని వివిధ రకాల పుష్పములచే సర్వాంగ సుందరంగా అలంకరించి విద్యుత్ కాంతి వెలుగుల మధ్య వేద పండితులు ఘనంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు, అనంతరం కుటుంబ సమేతంగా నిజరూప అవతారంలో దర్శనమిస్తున్న భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో శేషు భారతి, దేవాలయం ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు,మరియు అర్చకులు నాగరాజ్ శర్మ. అరవింద్ శర్మ. గణేష్ శర్మ. దత్తు శర్మ వేద ఆశీర్వచనాలతో అమ్మవారి శేష వస్త్రాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వద్దిరాజు సోదరులు వద్దిరాజు కిషన్ శశిరేఖ కుటుంబ సభ్యులు. వద్దిరాజు వెంకటేశ్వర్లు ఉమామహేశ్వరి,డా.జంగిలి వెంకట్ సునీత, వద్దిరాజు శ్రీనివాస్ శిల్ప,తౌడ్ శేట్టి నరసింహారావు పద్మజ దంపతులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

విజయదశమి దసరా పండుగ సందర్భంగా వరంగల్ లోని ప్రముఖ క్షేత్రాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర

దేవి శరన్నవరాత్రులను వైభోగవేతంగా నిర్వహించిన ప్రముఖ పుణ్యక్షేత్రలైన హనుమద్గిరి పద్మాక్షి దేవాలయం, మరియు ఆటోనగర్ శ్రీనివాస కాలనీ శృంగేరి శంకర మఠం శారదా దేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వేద పండితులు వేద వాయిద్యాలతో స్వాగతం పలుకి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కళ్యాణ మండపంలో వేద ఆశీర్వచనం తో పాటు అమ్మవారి శేష వస్త్రాలను తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో రవిచంద్ర సోదరుడు వద్దిరాజు వెంకటేశ్వర్లు ఉమామహేశ్వరి దంపతులు తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version