ఓరుగల్లు భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా దసరా పండుగ రోజు హంస వాహన తాటకం
విజయదశమి దసరా పండుగ సందర్భంగా వరంగల్ లోని ప్రముఖ క్షేత్రాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
దేవి శరన్నవరాత్రులను వైభోగవేతంగా నిర్వహించిన ప్రముఖ పుణ్యక్షేత్రలైన హనుమద్గిరి పద్మాక్షి దేవాలయం, మరియు ఆటోనగర్ శ్రీనివాస కాలనీ శృంగేరి శంకర మఠం శారదా దేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వేద పండితులు వేద వాయిద్యాలతో స్వాగతం పలుకి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కళ్యాణ మండపంలో వేద ఆశీర్వచనం తో పాటు అమ్మవారి శేష వస్త్రాలను తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో రవిచంద్ర సోదరుడు వద్దిరాజు వెంకటేశ్వర్లు ఉమామహేశ్వరి దంపతులు తదితరులు పాల్గొన్నారు..