వైద్య సేవలు ప్రజలకు తెలియాలి

మహబూబాబాద్,నేటిధాత్రి:

ప్రభుత్వపరంగా నిరుపేదలకు అందించే వైద్య సేవలు ప్రజలకు తెలియాలని జిల్లా కలెక్టర్ శశాంక డాక్టర్లకు సూచించారు.గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ … ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలకు లభించే వైద్య సేవలు తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు.హాస్పిటల్ కాంపౌండ్ పరిశీలిస్తూ హాస్పటల్ నిర్వహణ తీరును మెరుగుపరచాలన్నారు.ద్విచక్ర వాహనాలను ఆసుపత్రి వెనుక భాగంలో ఉన్న స్థలాన్ని ద్విచక్ర వాహనాల పార్కింగ్ కు కేటాయించాలన్నారు.డాక్టర్లతో కలిసి ఆర్థోపెటిక్ వార్డును సందర్శించి పరిశీలించారు.చేపట్టబోయే మరమ్మతుల పనులకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు అనంతరం రోగులతో కలెక్టర్ మాట్లాడారు.ప్రభుత్వ ఆసుపత్రిలో సకల సౌకర్యాలు ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని తెలియజేశారు.ఆసుపత్రిలో పరిశుభ్రతను పరిశీలిస్తూ పద్ధతి పాటించాలన్నారు చిన్నచిన్న మరమత్తులను చేపట్టి రోగులకు సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు.కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శ్రీనివాస్,ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ బానోత్ వెంకట రాములు,ఆర్ ఎం ఓ డాక్టర్ వైదేహి ఇతర డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version