రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని చిట్యాల పద్మ, బత్తిని విజయ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గుర్రం శ్రీకాంత్ తండ్రి లక్మిరాజం మరణించగా వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి. అనంతరం ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం, వంట నూనె నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో యువజన కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ ఉపాధ్యక్షులు మామిడి దిలీప్ కుమార్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, యువజన కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ నాయకులు అనుపురం పరశురామ్ గౌడ్, గ్రామస్తులు పూరేళ్ళ మనోజ్, అనుపురం శ్రీనివాస్, బత్తినీ విజయ్, కారుపాకల నరేష్, తదితరులు పాల్గొన్నారు.