ఉద్యోగ విరమణ సన్మానోత్సవం

ఆటపాటలతో చిందులేసిన విద్యార్థులు

ఉపాధ్యాయవృత్తి మహోన్నతమైనది ఎంఈఓ రమాదేవి

శాయంపేట నేటి ధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపా ధ్యాయులు పదవి విరమణ సన్మానోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. 1983 సంవత్సరంలో ఉపాధ్యా యురాలుగా ఎంపికై 40 సంవత్సరాలు విద్యాక్షేత్రంలో అమూల్యమైన సేవలందించిన 2024 సంవత్సరం ఏప్రిల్ ఉద్యోగ విరమణ పొందుతున్న చిదురాల శశికళ దేవి పదవి విరమణ మహోత్సవం జరిగిందిఈ పదవీ విరమణ మహోత్సవంలో విద్యార్థులు ఆటపాటలతో అలరించి శశికళ దేవి దంపతులను మండల పరిధిలోని ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు పూలమాలలు, శాలువాలు సత్కరించారు . విద్యార్థులు వీడ్కోలు శుభాకాంక్షలు తెలిపారు.జననం ఆదర్శవంతమైన ఉపాధ్యాయ వృత్తిలో 40 సంవత్సరాలు అమూల్యమైన సేవలందించిన తెలంగాణ ప్రభుత్వం చే ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు గ్రహీత, ఎందరో మన్నలను పొందిన ఓరుగల్లు గడ్డపై పుణ్య దంపతులైన చిదు రాల వీరయ్య చిలకమ్మా దంపతుల ఐదవ సంతానంగా 12-04-1963 లో జన్మించారు. ఉపాధ్యాయ వృత్తి ,కుటుంబ బాధ్యతలు, మార్గదర్శకాలు పాటిస్తూ అనంతరం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం ఉండాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఎం ఎన్ ఓ వెంకటేశ్వర రావు, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు తిరుప తిరెడ్డి ప్రధాన కార్యదర్శి శ్రీహరి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యా యురాలు మాధవి చంద్రమౌళి శ్రీలత పి ఆర్టియు మండల అధ్యక్షులు రాజా యుగేందర్ ప్రధాన కార్యదర్శి బానోతు సుధాకర్ రాథోడ్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version