యువకులారా యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా మారండి భావితరాలకు.

యువకులారా యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా మారండి భావితరాలకు మంచి భారతాన్ని అందిద్దాం

మాదకద్రవ్య రహిత సమాజం కోసం పాటుపడదాం

రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

 

 

మాదక ద్రవ్యాలు,గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు భాగస్వామ్యలై భావితరాలకు మంచి భవిష్యత్తుని,అందమైన భారతాన్ని అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మత్తుపదార్థాల వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ లో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.

అందులో భాగంగా మంగళవారం రోజున జైపూర్ మండలంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్ ముఖ్య అతిదిగా పాల్గొనడం జరిగినది.

 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాధకద్రవ్యాలకు దూరంగా ఉండాలని,భవిష్యత్తు రోజుల్లో మాధకద్రవ్యాల నిర్మూలన నేటి తరం విద్యార్థుల చేతిలోనే ఉంది అని అన్నారు.

 

విద్యార్థుల దృష్టి తమ భవిష్యత్తు జీవిత లక్ష్యం పై మాత్రమే ఉండాలని,నిషేధిత గంజాయి డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వాడకం పట్ల విద్యార్థులు ఆకర్షితులు కావద్దని సీపీ సూచించారు.

 

గంజాయి డ్రగ్స్ అలవాటు వలన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని కావున చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు.

 

మాదక ద్రవ్యాల నిర్ములన గంజాయి రహిత ప్రాంతమే లక్ష్యం గా రామగుండం కమీషనరేట్ పోలీస్ శాఖ కృషి చేస్తోందని అందులో బాగంగా విద్యాసంస్థలు,గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

 

మత్తుకు బానిస అవడానికీ అనేక కారణాలు ఉంటాయి పరిసరాల ప్రభావం,చెడు స్నేహితులు, సన్నిహితుల వలన చెడు మార్గాల వైపు వెళ్లకుండా జాగ్రత్త ఉండాలని అన్నారు.

 

గంజాయి,డ్రగ్స్‌ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్‌ లేకుండా చేస్తుందనే విషయాన్ని విద్యార్థులు గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులవ్వద్దని విజ్జప్తి చేశారు.మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత,విద్యార్థులు అంతా యాంటీ డ్రగ్స్ కమిటీలలో సభ్యులుగా చేరి యాంటీ డ్రగ్స్ సోల్జర్ గా సహకరించాలని తెలిపారు.

 

 

ఈరోజు ఇక్కడ తెలుసుకున్న విషయాలను కుటుంబ సభ్యులకు,స్నేహితులకు, బంధువులకు తెలియజేసి డ్రగ్స్ నివారణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.

 

 

Police Commissioner Amber Kishore Jha IPS

 

అదేవిధంగా విద్యార్థులు ఎక్కువ సమయం స్కూల్స్,హాస్టల్ లలో ఉంటారు కావున ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ,వారు ఎలాంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా జాగ్రత్త వహించాలన్నారు.

 

మీ మీ ప్రాంతాలలో ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు, సేవిస్తున్నట్టు తెలిస్తే వెంటనే సమాచారాన్ని స్థానిక పోలీసులకు ఇవ్వాలని కోరారు.యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి,డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్ముతూన్న వారిపై కేసులు నమోదు చేస్తామని అన్నారు.

 

ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మిన,సరఫరా చేసిన,సేవించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

ఈ సందర్భంగా విద్యార్థులు అధికారులతో కలిసి మాదక ద్రవ్యాలు,గంజాయి వాడకంపై పోస్టర్లను ఆవిష్కరించారు.

మేము డ్రగ్స్ తీసుకొము,బంధుమిత్రులు, చుట్టుపక్కల వారు,స్నేహితులు మాధకద్రవ్యాలకు అలవాటు బారిన పడకుండా వారిని చూసుకునే బాధ్యత మాదే అని డ్రగ్స్ వల్ల కలిగే అనార్ధాల గురించి వారికి వివరిస్తాం అని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించారు.

 

 

 

Police Commissioner Amber Kishore Jha IPS

 

ఈ కార్యక్రమం లో మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఐపిఎస్.జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లా రెడ్డి,ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్,నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్,జైపూర్ ఎస్సై శ్రీధర్,భీమారం ఎస్సై శ్వేతా,శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్,సిసి హరీష్,కస్తూర్బా ప్రిన్సిపాల్.ఫణి బాల,సాంఘిక సంక్షేమ ప్రిన్సిపాల్,కోలా నాగేశ్వరరావు,సాంఘిక సంక్షేమ కోటపల్లి ప్రిన్సిపాల్ బి.రమేష్ బాబు, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు,నార్కోటిక్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version