హ్యుమన్ రైట్స్ ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా యేంపెల్లి వీరాస్వామినియామకం.

మంగపేట నేటి ధాత్రి

వరల్డ్ హ్యుమన్ రైట్స్ డే సందర్బంగా హైదరాబాద్ మల్కాజిగిరి నేరేడుమెట్ అంబేద్కర్ భవన్ లో జరిగిన హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో సమావేశం లో సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ అయ్యప్ప బరిగే సుప్రీం కోర్ట్ అడ్వాకెట్ మరియు సంస్థ గౌరవ సలహాదారు రాందాస్ తేజావత్ ఏ డి ఎన్ ఎల్ ఏ సి పి హైదరాబాద్ సిటీ మరియు తెలంగాణ రాష్ట్ర బాధ్యులు నారాయణ రెడ్డి, భాషా ,దాసరి రఘు సమక్షంలో ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపెల్లి గ్రామానికి చెందిన యేంపెల్లి వీరస్వామిని హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది.ఈ సందర్బంగా యేంపెల్లి వీరస్వామి మాట్లాడుతూ నన్ను హ్యుమన్ రైట్స్ ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినందుకు సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్, సుప్రీం కోర్ట్ అడ్వాకెట్ అయ్యప్ప బరిగే కి మరియు నేషనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నాయకులందరికి పేరు, పేరున,ధన్యవాదములు తెలియజేస్తూ, నా మీద నమ్మకం తో ములుగు జిల్లా బాధ్యతలు అప్పజెప్పినందుకు , సమాజం లో జరుగుతున్న కులం, మతం, ప్రాంతం,మహిళలు, బాలకార్మికుల,మానవ హక్కులపై జరిగే అన్నిరకాల హింసలను, వివక్ష తలను,అసమానాతలనపై రాష్ట్ర నాయకత్వం ఆదేశాలతో చట్టభద్ధంగా, న్యాయబదంగా, ధర్మబదంగా, మానవ హక్కుల ప్రధాత ప్రపంచ నాయకుడు, యుగపురుషుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో సమస్యల పరిస్కారం కోసం తనవంతుగా కృషి చేస్తానని, ములుగు జిల్లా ను తెలంగాణ రాష్ట్రం లో ముందువరసలో నిలబెడతానని తెలియజేస్తున్నాను అని అన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version