బెల్లంపల్లి నేటిధాత్రి :
ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల దగ్గర్లో,ఫుడ్ ప్రాసెస్సింగ్ యూనిట్ కు సంబందించిన భూముల్లో నుండి ట్రాక్టర్లతోటి అక్రమంగా మట్టి తరలిస్తూ చదునుగా ఉన్న భూమిని గుంటలు చేస్తూ లక్షలాది రూపాయల మట్టి దందా ట్రాక్టర్ యజమానులు చేస్తున్నారు వెంటనే ఈ మట్టి తరలింపును ఆపించగలరని ఎం సి పి ఐ యు నాయకులు తాసిల్దార్ జోష్ణ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల దగ్గర్లో,ఫుడ్ ప్రాసిసింగ్ యూనిట్ కి సంబందించిన భూమిలో నుండి కొన్ని నెలల నుండి ట్రాక్టర్ యజమానులు అక్రమంగా మట్టిదందా చేస్తున్నారని ,ప్రభుత్వ అనుమతి ఇచ్చినట్టు విచ్చలవిడిగా ఈ మట్టిదందా పట్టపగలు చేస్తున్నారని, ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటలవరకు అక్రమ మట్టి దందా కొనసాగిస్తూ లక్షలాది రూపాయలను సంపాదించుకుంటున్నారని, ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి దందా రోజుకు 20 నుండి 30 ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్న కూడా సంబంధిత అధికారులు ఎవరు కూడా ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని,అక్రమ మట్టి దందాను ఆపడం లేదని,ఈ అక్రమ మట్టి దందా వల్ల పర్యావరణం దెబ్బతింటుందని,ఇండ్ల ముందు నుండి ఈ మట్టి ట్రాక్టర్లు పోవడం వల్ల ఈ మట్టి గాలికి ఎగిరి ప్రజల కళ్ళల్లో పడుతుందని అంతేకాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కావున వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని లేనియెడల ఎం సి పి ఐ యు పార్టీ ఆధ్వర్యంలో తగు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.