108 ప్రసాదాలతో గణపతికి ఘనంగా పూజలు.

నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోగల పదో వార్డు పోచమ్మ ఆలయంలో విఘ్నేశ్వర నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా గణపతికి ఇష్టమైన 108 ప్రసాదాలతో  వార్డులోని మహిళలు, కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్, పోచమ్మ యూత్ గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో వేద పండితులు నిశాంత్ శర్మతో ఘనంగా పూజలు నిర్వహించారు.కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్ మాట్లాడుతూ 108 రకాల ప్రసాదాలతో పూజలు చేయడం సంతోషకరం అని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రజలకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాళ్ళపెల్లి కళ్యాని, నాగిశెట్టి ప్రణీత,ఎదురబోయిన రమ , మౌనిక,అదర్సండె రమదేవి,రావిళ్ళ పద్మజ,రావిళ్ళ సుమతి,దూసరి సంపూర్ణ,పసరుగొండ మానస,కటకం రాజకళ,తౌటం వెన్నెల,బొల్లా సుమ, గందె కోటేశ్వరి,బెజ్జంకి మౌనిక,రాళ్ల బండి సరోజన,కొలువుల వసంత, కొలువుల కోకిల,బత్తుల లక్ష్మిదేవి, కొలపద్మ, వార్డు ప్రజలు, మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version