శాయంపేట నేటి ధాత్రి:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మహిళలతో సఖి వన్ స్టాప్ కేంద్రం హన్మకొండవారి ఆధ్వర్యంలోమహిళ అవగాహన సదస్సు ను నిర్వహించడం జరిగింది.
ఈ సదస్సులో సఖి వన్ స్టాఫ్ కేంద్రం వెన్నెల,హరిత మాట్లాడుతూ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ మరియు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్ నిర్వహించబడుతున్నదని,
విడిపోయే భార్యాభర్తలను కౌన్సిలింగ్ ద్వారా ఒకటిగా కలపడం చేస్తున్నదని,
వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు,ఆడపిల్ల వద్దని అకారణంగా గర్భవిచ్చితి చేపించాలని వేధింపులకు గురి చేయడం మరియు ఇతర వేధింపుల పట్ల మానషికంగా కృంగిపోయేమహిళలకు,బాలికలకు రక్షణ కల్పించడం కోసం సఖి వన్ స్టాఫ్ కేంద్రం కృషి చేస్తున్నదని,సమస్యలపై సహాయం కోసం సఖి కేంద్రంకు వచ్చిన మహిళలకు ఉచితంగా కౌన్సిలింగ్ సహాయం , న్యాయ సహాయం, పోలీసుల సహాయం, ,వైద్య సహయం, తాత్కాలిక వసతి వంటివి సఖి కేంద్రం ద్వారా అందించ బడుతున్నదని తెలియ చేశారు.ఇట్టి అవకాశాన్ని సమస్యలు గల మహిళలు,బాలికలు ఉపయోగించు కోవాలని, అందుకోసం ఫోన్ నెంబర్స్ 0870-2452112 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 181 కు ఫోన్ చేయగలరనిమహిళలను,పాఠశాల బాలికలను కోరడం జరిగింది. ఈసమావేశంలో ఎంపీడీవో ఎమ్మార్వో, స్పెషల్ ఆఫీసర్ సాక్షి టీం కేసు వర్కర్ వెన్నెల, హరిత, పంచాయతీ సెక్రెటరీ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.