ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం ప్రోగ్రాం ప్రారంభం.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం రోజున ఉదయం ప్రధానోపాధ్యాయులు కే రఘుపతి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు అల్పాహార భోజనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు రుచికరమైన శుభ్రమైన నాణ్యతతో కూడిన అల్పాహార భోజనాన్ని విద్యార్థు లు చక్కగా వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులు సమయానికి క్రమం తప్పకుండా బడికి పంపించాలని ఈ సందర్భంగా కోరారు. ఇట్టి కార్యక్రమంలో శ్రీరామ్ రఘుపతి స్కూల్ చైర్మన్ సర్పంచ్ పూర్ణచంద్రరావు మరియు ఉపాధ్యాయులు బొమ్మరాజమౌళి, ఉస్మాన్ ,సరళాదేవి .నీలిమారెడ్డి, రామనారాయణ. సదయ్య .సుజాత. విజయలక్ష్మి ,కల్పన, శంకర్, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు .

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version