మహిళా చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం పట్టణ ఎస్సై విజయలక్ష్మి

సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాగిన మహిళా సంఘం ర్యాలీ
మహిళల కోసం ఏర్పడ్డ చట్టాలను అధ్యయనం చేసి సద్వినియోగం చేసుకోవాలని పట్టణ ఎస్సై విజయలక్ష్మి కోరారు. ఐద్వా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభ సందర్భంగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ప్రదర్శన ర్యాలీని ఎస్సై విజయలక్ష్మి ప్రారంభించగా ర్యాలీ అగ్రభాగాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఉపాధ్యక్షురాలు బుగ్గ వీటి సరళతో పాటు జిల్లా ప్రధాన నాయకత్వం నిలిచిన ఈ ర్యాలీని ప్రారంభిస్తూ పట్టణ ఎస్ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలందరూ ఐక్యంగా తమ హక్కుల కోసం నినదించటం అభినందనీయమని అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్నిట్లో సమానంగా నిలుస్తున్నారని అదే ఈ దేశ అభివృద్ధికి మూలమని అభిప్రాయపడ్డారు. మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖలో అనేక విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందని షీ టీమ్ లతో పాటు సఖి సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళల రక్షణ కోసం 24 గంటల పాటు పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. మహాసభల సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రేలా నృత్యంతో పాటు కోలాటాలు నిర్వహిస్తూ హక్కుల కోసం నినదిస్తూ పట్టణంలో పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సభను నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version