జమిలి ఎన్నికల విధానాన్నికేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు: సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
జమిలీ ఎన్నికల విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు అని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిఅన్నారు. గట్టుప్పల మండల కేంద్రంలో గట్టుపల టౌన్ శాఖ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,2029 నుంచి ఒకే దేశం- ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్లో ప్రవేశపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికివిరుద్ధమన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలి ఎన్నికల పద్ధతి అనుకూలం కాదు అని చెప్తు వస్తున్నప్పటికీ బిజెపి ప్రభుత్వం . మొండిగా వ్వహరిస్తుందని ఆయన విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని, వాళ్ల ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటికరన చేయడానికి ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఎన్నికల ముందు బిజెపి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాననిహామీ ఇచ్చి,హామీని తుంగలో తొక్కారన్నారు. రానున్న రోజుల్లో బిజెపిని గెలవకుండా అందరము శాయశక్తుల కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో బిజెపి ప్రభుత్వం రాముడు పేరుతో రాజకీయం చేస్తున్నారనిఆయన అన్నారు..గత ఎన్నికల ముందుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుప్రజలకు ఇచ్చినహామీలనువెంటనే అమలు చేయాలన్నారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం6 గ్యారంటీలనుఅమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంఇచ్చిన హామీలలోరైతు భరోసా,రుణమాఫీకొంతమంది మాత్రమే రుణమాఫీ చేశారని, మిగిలిన రైతులందరికీ కూడారుణమాఫీని వర్తింపజేయాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ దేశంలోబిజెపి అనుసరిస్తున్నప్రజా వ్యతిరేక విధానాల ను తిప్పి కొట్టాలని అయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోసిపిఎంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, సిపిఎం గట్టుపల్ మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులుచాపల మారయ్య.సిపిఎం సీనియర్ నాయకులు ఎండి. రబ్బాని,సిపిఎం మండల కమిటీ సభ్యులుకర్నాటి సుధాకర్,కర్నాటి వెంకటేశం,కుకునూరు నగేష్,సిపిఎం నాయకులుఖమ్మం రాములు,పెదగాని నరసింహ,ముసుకు బుచ్చిరెడ్డి,నల్లవెల్లి బిక్షం,పసుపుల చెన్నయ్య,కె. నరసింహ, జ్ఞానేశ్వరి, ఉష, రాములమ్మ, అంశమ్మ, సావిత్రమ్మ, యాదమ్మ, లక్ష్మమ్మతదితరులు పాల్గొన్నారు. అనంతరం గట్టుపల్ టౌన్ శాఖ కార్యదర్శిగాకర్నాటి సుధాకర్,కర్నాటి వెంకటేశం, పెద్దగాని నరసింహ ఏకగ్రీవంగాఎన్నికయ్యారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version