కేసిఆర్ రుణం తీర్చుకోలేనిది.
ఆయన అడుగుజాడల్లో నడుస్తా.
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.
రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవ ఎన్నిక.
రిటర్నింగ్ అధికారి నుండి ధ్రువీకరణ పత్రం అందుకున్న వద్దిరాజు రవిచంద్ర .
గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులు.
“నేటిధాత్రి” హైదరాబాద్
తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి , కేసిఆర్ అడుగుజాడల్లో నడుస్తానని బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో సభ్యునిగా ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారు. అందుకు సంబంధించిన దృవీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా మంగళవారం అందుకున్నారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత మరియు మాజీ ముఖ్యమంత్రి , బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ తోనే తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన బిసి వర్గాల అభివృద్ధి జరిగింది అని అన్నారు. బీసీలను రాజకీయంగా బలోపేతం చేసేందుకు కెసిఆర్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నత అవకాశాలు కల్పించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో తెలంగాణ ప్రజల ప్రయోజనాల కొరకు నిత్యం కృషి చేస్తానని రవిచంద్ర చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రకు ఖమ్మం జిల్లాకు చెందిన బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మరియు ఇతర ఎమ్మెల్సీ లు, బిఆర్ఎస్ పార్టీ నేతలు అభినందనలు తెలియజేశారు.