‘పాపం ఎవరో అభాగ్యుడు.. గుర్తు పడితే చెప్పండి’.

‘పాపం ఎవరో అభాగ్యుడు.. గుర్తు పడితే చెప్పండి’

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గల సాదు వెంకటరెడ్డి వెంచర్ సమీపంలోని దుందుభి వాగులో మంగళవారం ఉదయం 10 గంటలకు గుర్తు తెలియని ఓ వ్యక్తి నీటిపై తేలియాడుతూ కనిపించాడు. వెంటనే స్థానికులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. మృతుడు (44) ఆనవాళ్లను బట్టి హిందు మతానికి చెందిన వాడని, ఐదు ఫీట్ల రెండు ఇంచుల ఎత్తు కలిగి ఉన్నాడని, మృతుడి శరీరంపై ఆకుపచ్చని టీ షర్టు, పాయింట్ ధరించి ఉన్నాడన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ఆసుపత్రికి తరలించమన్నారు. పంచాయతీ కార్యదర్శి జగన్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఎవరికైనా.. మృతుడి ఆచూకీ తెలిస్తే.. బాలానగర్ ఎస్సై లెనిన్ ఫోన్ నెంబర్ 87126 59346 సంప్రదించాల్సిందిగా కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version