తెలంగాణ ఉద్యమకారులకు ఆసరా ఎప్పుడు

కెసిఆర్ టిఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు గుర్తొస్తుందా

రామయంపేట (మెదక్) నేటి ధాత్రి 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులకు ఉపాధి ఇవ్వాలి ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలకు చెరసాలలకు బలైన వారిని గుర్తించాలి ఆధారాలతో పోలీస్ రికార్డులలో ఉన్నవారికి తప్పనిసరిగా హాజరై ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది అమరవీరుల త్యాగాలు యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలు యువకుల ప్రభుత్వ ఉద్యోగుల బలిదానాలు తెలంగాణ రావడానికి నిదర్శనాలు కేసీఆర్ మాయ నాటకాలతో అధికారం చేపట్టి పది సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన ఉద్యమకారులను గుర్తించిన పాపాన పోలేదు ఓట్లు అడగడానికి రావడానికి బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం అధికారం లేదు టిఆర్ఎస్ నాయకులను అభ్యర్థులను తరిమి తరిమి కొట్టండి మాజీ టిఆర్ఎస్ నాయకుడు పోలీస్ కేసుల్లో ఇరుక్కొని జీవితాన్ని బలిదానం చేసుకున్న లెక్చరర్ పోలీస్ దేవేందర్ ఆవేదన.. ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రచారానికి రావడం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులను ఆదుకుంటామని ఎన్నికల్లో హామీ ఇవ్వడం స్వాగతిస్తున్నామన్నారు. వీలైనంత తొందరగా ఉద్యమకారులకు మంచి శుభవార్త చెప్పాలని ఆయన కోరారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఉద్యమకారులను గుర్తించి ఆలోచించిందని గతంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కనీసం ఆ ఊసు కూడా తీయలేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *