బీసీ హాస్టల్ భవనం కోసం సంక్షేమ అధికారి వినతి పత్రం.

బీసీ హాస్టల్ భవనం కోసం సంక్షేమ అధికారి వినతి పత్రం

నల్లబెల్లి,నేటిధాత్రి:

 

 

 

 

నల్లబెల్లి మండల కేంద్రంలోని
బీసీ హాస్టల్ భవనాన్ని మరమ్మతు చేసి నూతన భవనం ఏర్పాటు చేసేవరకు బీసీ హాస్టల్ విద్యార్థులను ఎస్సీ హాస్టల్లోకి మార్చాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పాలతకు వినతి పత్రం అందజేశారు.అనంతరం ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్, స్వేరోస్ మాజీ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేంద్రప్రసాద్, వి హెచ్ పి ఎస్ మండల అధ్యక్షుడు పులి రమేష్ మాట్లాడుతూ నల్లబెల్లి మండల కేంద్రంలోని గత 30 సంవత్సరాల క్రితం నిర్మించిన బీసీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకోవడం వలన విద్యార్థులు భయం గుప్పెట్లో ఉంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు భవన పైనుండి పెచ్చులు ఊడి పడతాయని భయంతో కాలం వెలదీసే పరిస్థితి విద్యార్థులకు నెలకొందని అన్నారు.ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్న క్రమంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న విద్యార్థులు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు, హాస్టల్ భవనం శిథిల వ్యవస్థ ఉండడంతో హాస్టల్లో ప్రవేశం పొందేందుకు సానుకూలంగా లేకపోవడంతో విద్యార్థులు వేరొక చోటకు వెళ్లే పరిస్థితి నెలకొందని అధికారులకు తెలిపారు. అధికారులు నూతన భవనం ఏర్పాటు చేసేంతవరకు, నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయం ప్రక్కన ఉన్న ఎస్సీ హాస్టల్ భవనంలోకి మార్చి హాస్టల్ విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా బిసి సంక్షేమ జిల్లా అధికారి పుష్పలత ద్వారా జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, భరత్,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version