సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి
శ్రీరాంపూర్,(మంచిర్యాల) నేటి ధాత్రి:
సింగరేణి కార్మికుల చిరకాల స్వప్నమైన సొంతింటి కల నెరవేరేంతవరకు పోరాడుతూనే ఉంటామని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు.మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా లోని ఎస్ఆర్పీ3 గనిలో ఆర్గనైజర్ వెంగళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగులో వారు పాల్గొని మాట్లాడారు. గెలిచిన,ప్రాతినిధ్య సంఘాలకు కార్మికులపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.కార్మికులకు సొంతింటి కల నెరవేర్చడం ద్వారా కార్మికులకు, యాజమాన్యానికి, ప్రభుత్వానికి కలిగే లాభాలను కులంకషంగా వివరించారు. గతంలోని కోల్ ఇండియాలో పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ ను రద్దు చేశాయని,అధికారులకు చేసినట్టుగానే కార్మికులకు కూడా ఇన్కమ్ టాక్స్ పై రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే కార్మికుల ప్రధాన సమస్య అయినా మారుపేర్లపై గెలిచిన, ప్రాతినిధ్య సంఘాలు స్పందించకపోవడం అమానుష్యమన్నారు.కార్మికుల సమస్యలు పరిస్కారం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టుకుని గెలిచిన గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాలు స్ట్రక్చర్ మీటింగ్లలో ఆ ఊసే ఎత్తకుండా కార్మికులను మోసం చేస్తున్నాయన్నారు.ఈ సమస్యలపై పరిష్కారానికై ముఖ్యమంత్రి ని సైతం కలిసి సమస్య పరిష్కారం దిశగా సిఐటియు గా కృషి చేస్తామన్నారు.సమస్యను పరిష్కారం కాకుంటే సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ఎల్లవేళలా పోరాటాలు చేస్తుందని, అందులో బాగంగానే భవిష్యత్తులో నిర్వహించే ఉద్యమాలకు కార్మికులందరూ యూనియన్ లకు అతీతంగా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు.అండర్ గ్రౌండ్ నుండి సర్ఫేస్ ఓపెన్ కాస్ట్ కు ఖాళీలను కంపెనీ అవసరాలు నిమిత్తం భర్తీ చేస్తుంది. కార్మికుల బేసిక్ తగ్గించడం భవిష్యత్తులో పెన్షన్ పై ప్రభావం చూపడం కార్మికుని ఆర్థికంగా నష్టపరుస్తుంది. దీనిపై గెలిచిన ప్రాతినిధ్య సంఘాలు సమాధానం చెప్పాలి.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుల్ల బాలాజీ ట్రెజరర్ కస్తూరి చంద్రశేఖర్ మందమరి బ్రాంచ్ అధ్యక్షులు వెంకటస్వామి, ఆర్జి.1 అధ్యక్షులు రాజమౌళి బ్రాంచ్ నాయకులు బోడకుంట శంకర్, చీకట్ల సాగర్,శ్రీపతి బానేష్ ,పేరుక సదానందం, మేల్లం శ్రీధర్,శైల శ్రీనివాస్, నరహరి,వెంకట్ రెడ్డి ఆషాడం రమేష్,మాదాసు విజయ్, ప్రతాప్,ఇతినేని వెంకటేష్,పల్లె రాకేష్,కేసిపెద్ది శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.