కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకు సహకరిస్తా ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ పోరాట యోధులు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషిచేసిన మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు తన వంతు సహకారం అందిస్తామని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హామీ ఇచ్చారు. భూపాలపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా అధ్యక్షులు ఎలగొండ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఆవిష్కరించారు . కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావుకు పూల బోకే అందజేసి శాలువా కప్పి సన్మానం చేశారు. అనంతరం శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని సైతం వదులుకున్న గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు . ఇప్పటికే ప్రభుత్వం ఆయన జయంతి ,వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అడ్డగట్ల శ్రీధర్ ,రాష్ట్ర రాజకీయ విభాగం నాయకులు గూట్ల తిరుపతి , ఇప్పకాయల నరసయ్య , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలిపాక ప్రసాద్, రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు బొద్దుల శంకర్, విక్రమ్ సేన, రాష్ట్ర రైతు విభాగం నాయకులు తుమ్మ రమేష్, రాష్ట్ర మీడియా సెల్ విభాగం నాయకులు సామల శ్రీనివాస్ ,శేఖర్ నాని, సుభాస్ కాలనీ ఆదర్శ పద్మశాలి సంఘం అధ్యక్షులు కొండ శీను కార్యదర్శి దుబాసి రాజం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి క్యాతం అనిల్ కుమార్, తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి వంగ కుమారస్వామి, నాయకులు క్యాతం మహేందర్, దుబాసి సమ్మయ్య ,రాచర్ల శ్రవణ్, తాళ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version