నూతన అధ్యక్షులు నారగోని ఎల్ల స్వామి, ప్రధాన కార్యదర్శి నిమ్మల భద్రయ్య
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన కమిటీ రేషన్ డీలర్ల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తుందని నూతన కమిటీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు భత్తుల రమేష్ బాబు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఎన్నిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దుర్గం సమ్మయ్య ఆధ్వర్యంలో డీలర్లు సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లా అధ్యక్ష కార్యదర్శలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నారగోని ఎల్లస్వామిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా నిమ్మల భద్రయ్య, ఉపాధ్యక్షునిగా దుర్గం సమ్మయ్య, పెద్దమల్ల సమ్మయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల డీలర్లు సమావేశమై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి తనను జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు డీలర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల భద్రయ్య మాట్లాడుతూ జిల్లాలోని రేషన్ డీలర్ల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తామని, ఎవరికి ఎలాంటి హాని కలగకుండా ముందుండి సమస్యలను పరిష్కరిస్తానని, డీలర్ల భాగం కోసం ఎలాంటి త్యాగనికైనా సిద్ధపడి, అందరికీ న్యాయం జరిగేలా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. తన మీద నమ్మకం ఉంచి తనను తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు డీలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని డీలర్లు అందరూ పాల్గొన్నారు.