మొగుళ్ళపల్లి లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

కాంగ్రెస్ లోకి సర్పంచులు

-కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గండ్ర
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో మొగుళ్ళపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. చిట్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్ నేతృత్వంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని, బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ద్వితీయ శ్రేణి నాయకులు క్యూ కడుతున్నారన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మొగిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *