ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ.అధ్యక్షులు దినేష్ !! జగిత్యాల నేటి ధాత్రి
తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పైన బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.అని మండల కాంగ్రెస్ పార్టీ, నాయకులు అన్నారు, ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ. ఆద్వర్యంలో మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమీక్ష సమావేశంలో రేవంత్ రెడ్డి పైన బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని,ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి పైన ఇలాంటి అసబ్ధ పదజాలంతో వాక్యలు చేయడం వారి స్థాయికి తగడదని,రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ మెప్పు పొంది ఎంపి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి మాటలు మాట్లాడటం జరుగుతుందని,ఒక వేళ బిఆర్ఎస్ పార్టీ నుండి ఎంపిగా పోటీ చేసిన సుమన్ కి ఓటమి తప్పదని,ప్రజాస్వామ్యంలో ఏ విధంగా మాట్లాడాలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఒక స్పష్టమైన అవగాహన తమకు ఉందని,కానీ ఈ విధంగా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం సరైన పద్దతి కాదని,వెంటనే బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనబట్ల దినేష్ ,ఉపాధ్యక్షుడు వేముల రాజేష్,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింహరాజ్ ప్రసాద్,మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు రఫియోద్ధిన్,టౌన్ యూత్ అధ్యక్షులు తిరుపతి, సుముక్, ఎన్ఎస్ యు ఐ అసెంబ్లీ అధ్యక్షులు శ్రవణ్,రాపర్తి సాయికిరణ్,టౌన్ బిసి సెల్ అధ్యక్షులు వొజ్జల లక్ష్మణ్,అశేట్టి శ్రీనివాస్,శ్రీపతి సత్యనారయణ,గణేష్,నరేష్,రాజేష్,ప్రశాంత్, రాజయ్య,శ్రీకాంత్,శశి,గోపి,అభి,పోషన్న,రమణ,రవి,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
