వార్డు ప్రజలే నా కుటుంబ సభ్యులు

వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో కౌన్సిలర్ మడికొండ సంపత్ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సానిటేషన్ పనులు,వార్డులో ప్రజలకి డ్రైనేజీ శుభ్రం చేయించుట,ఇంటింటికి స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరించుట,ఇంటింటికి నల్లాల ద్వారా నీళ్లు అందించుట, స్ట్రీట్ లైట్ వార్డులో వెలిగేలా చూడటం వార్డులో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడడం,వార్డు ప్రజలకి నిత్యము అందుబాటులో ఉండడం,ప్రతిరోజు ఉదయాన్నే వార్డులో తిరుగుతూ వార్డులో నెలకొని ఉన్న సమస్యల గురించి తెలుసుకోవడం త్వరితగతిన పరిష్కారం చేయడంజరుగుతుంది.నిత్యం వార్డు అభివృద్ధి కొరకు కౌన్సిల్ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువెల్లి సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది.ఏ ఆపద వచ్చినా కుటుంబ సభ్యుడి లాగా దగ్గర ఉండడం,ఏ అవసరం పడినా అందుబాటులో ఉండడం,గత కరోనా కాలంలో కూడా ఇల్లు ఇల్లు తిరుగుతూ కరోనా వస్తే ఎలా ఎదుర్కోవాలని,రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహనా కార్యక్రమం చేపట్టే వారు.ఈ సందర్బంగా కౌన్సిలర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ వార్డు ప్రజలు నా మీద నమ్మకంతో గతంలో గెలిపించినందుకు వార్డులో ఎలాంటి సమస్యలు తలెట్టకుండా చూసుకుంటున్నానని వార్డు ప్రజలే నా కుటుంబ సభ్యులని ఆయన అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version