జైపూర్ మండల్ ఎన్ఎస్ యుఐ జనరల్ సెక్రెటరీగా మీనుగు మణికంఠ నియామకం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా ఎన్ఎస్ యుఐ ప్రెసిడెంట్ ఆదర్శ్ వర్ధన్ రాజు జైపూర్ మండల్ ఎన్ఎస్ యుఐ జనరల్ సెక్రెటరీగా మీనుగు మణికంఠ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా మీనుగు మణికంఠ మాట్లాడుతూ ఈ పదవి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, ఎన్ఎస్ యుఐ బలోపేతానికి తన సాయశక్తుల కృషి చేస్తానని, ఎన్ఎస్ యుఐ నిర్వహించే అన్ని కార్యక్రమాలలో తన వంతు బాధ్యతను తప్పకుండా పోషిస్తానని, అధిష్టాన ఆజ్ఞ ప్రకారం అన్ని వేళల్లో ముందుండి నడుస్తానని అన్నారు. అనంతరం జిల్లా ప్రెసిడెంట్ ని శాలువాతో సన్మానించి హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *