వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారేపెళ్లి సుధీర్ కుమార్ ను గెలిపించండి

మాజీ సర్పంచ్ నరహరి పద్మ వెంకట్ రెడ్డి
మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి న్యూస్
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పల్లి మండలం మోట్లపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ నరహరి పద్మ వెంకట్ రెడ్డి. ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆయన కోరారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదాని మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని ఇవ్వలేదని రుణమాఫీ చేయలేదని రైతుబంధు ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ ను అత్యధిక మెజార్టీతోగెలిపించాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ విష్ణు. మాజీ ఉపసర్పంచ్ ఆళ్ల గోపాల్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version