నిజాంపేట: నేటి ధాత్రి
దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని సొసైటీ వైస్ చైర్మన్ వెంకట్ స్వామి గౌడ్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్, నగరం తండా గ్రామాలలో రామాయంపేట సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు జరపాలన్నారు. ప్రభుత్వం క్వింటల్కి 2,300 రూపాయలు రైతులకు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, గ్రామస్తులు కోమ్మడి జీవన్ రెడ్డి, మ్యదరి ప్రభాకర్, పిట్ల ఆంజనేయులు, పిట్ల రమేష్, ఊడెపు రాజయ్య, మ్యదరి స్వామి, తదితరులు పాల్గొన్నారు.