విజయసంకల్ప యాత్రను విజయవంతం చేయాలి.

# అభివృద్ధి మన నినాదం ఆచరణ మన గమ్యం.

నర్సంపేట,నేటిధాత్రి :

భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో చేపట్టనున్న విజయసంకల్ప యాత్రను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు,బిజెపి కాంటెస్ట్ అభ్యర్థి
డాక్టర్ కంభంపాటి ప్రతాప్ అన్నారు.
పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం
యాత్ర ప్రముఖ్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ కంభంపాటి ప్రతాప్ మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికలలో బిజెపి విజయం సాధించాలని మహబూబాబాద్ పార్లమెంట్ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయాలని అందులో భాగంగానే విజయ సంకల్పయాత్రను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఖానాపూర్ మండలం మంగళవారిపేట గ్రామం నుండి మొదలయ్యే యాత్ర నియోజకవర్గం వ్యాప్తంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ యాత్రకు ముఖ్య అతిధులుగా భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ శాసనసభ్యులు రఘునందన్ రావులు పాల్గొంటారని తెలిపారు. అదే మొదటి రోజు నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో సాయంత్రం 6 గంటలకు సభ నిర్వహణ ఉంటుందన్నారు.నరేంద్ర మోడీ సర్కార్ దేశ ప్రజల భవితవ్యం బాగుండాలని ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని కృషి చేస్తున్నారని అన్నారు.10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో అవినీతి అనేది లేకుండా అభివృద్ధి ధ్యేయంగా ఆచరణగా పాలను కొనసాగిస్తున్నారని ప్రతాప్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మీడియా ఇంచార్జ్ మాజీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మల్యాల వినయ్ కుమార్ గుప్తా, పట్టణ అధ్యక్షులు బాల్నా జగన్, కౌన్సిలర్స్
శీలం రాంబాబు గౌడ్,జుర్రు రాజు యాదవ్, లూనవత్ కవిత వీరన్న, మినుముల రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శులు కొంపల్లి రాజు,శివరాం, సీనియర్ నాయకులు రవీందర్, సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version