రామకృష్ణాపూర్, ఫిబ్రవరి 17, నేటిధాత్రి:
విజిలెన్స్,యాంటీ కరప్షన్ కౌన్సిల్(వి ఏ సి సి) రాష్ట్ర అధ్యక్షుడిగా గోదావరిఖనికి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజికవేత్త వేల్పుల మురళీధర్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కౌన్సిల్ చైర్మన్ న్యాయవాది మోతె రాజలింగు ఓ ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు నియామక ఉత్తర్వులను రామకృష్ణాపూర్ పట్టణంలోని కౌన్సిల్ కార్యాలయంలో అందజేశారు.కౌన్సిల్ బలోపేతానికి నిబద్ధతతో పనిచేయాలని, అవినీతిని, సాంఘిక దురాచారాలను నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. పోలీస్, ప్రెస్ మీడియా సమన్వయంతో నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు.