ఆర్.ఎం.పి & పి.ఎం.పి జిల్లా ప్రధాన కార్యదర్శి బొద్దుల శ్రీనివాస్
జైపూర్, నేటి ధాత్రి :
ఎన్నో ఏళ్ల తరబడి ప్రథమ చికిత్స సేవలు అందిస్తూ
ఇదే మా జీవనోపాధిగా కొనసాగిస్తూ
గ్రామీణ వైద్యులు లేకపోతే ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటారని ప్రతి పల్లెటూరిలో గడప గడపకి వారి ఇంట్లో ఎంత మంది ఉన్నారో గ్రామీణ వైద్యులకు తెలుసు కోడి కూత కూసిన తరువాత బ్యాగు పట్టుకొని ఎలా ఉందమ్మా మీ ఆరోగ్యం అనేది గ్రామీణ వైద్యులే. రాత్రనక పగలనక ఎండ ఆనక వాన ఆనక నిత్యం అందుబాటులో ఉండేది గ్రామీణ వైద్యులే.
కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రం అల్లాడుతుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ మూసి వేయడం గ్రామీణ వైద్యులు మాత్రం ధైర్యంగా తగు జాగ్రత్తలు ప్రజలకు చెప్తూ గ్రామీణ వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టీ వైద్యసేవలు అందించారని పేర్కొన్నారు.
క్వాలిపై డాక్టర్లు సెల్ఫ్ ఇంజక్షన్ లు సెలైన్ బాటిల్స్ వ్రాస్తే ఇంజెక్షన్లు ఇచ్చేది గ్రామీణ వైద్యులే దయచేసి గ్రామీణ వైద్యుల పై దాడులు ఆపాలని కోరుతున్నాము.
అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి వై ఏ స్.రాజశేఖర్ రెడ్డి గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు ఇచ్చారు.
మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే శిక్షణ తరగతుల మొదలు పెట్టాలని అర్హులైన గ్రామీణ వైద్యులకు 108 లో కానీ పల్లె దావాఖనలో తీసుకోవాలని మంచిర్యాల ఆర్.ఎం.పి, పి.ఎం.పి జిల్లా ప్రధాన కార్యదర్శి బోద్ధుల శ్రీనివాస్ అన్నారు.