కొడిమ్యాల (నేటి ధాత్రి ):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కొడిమ్యాల నుండి నాచుపల్లి వెళ్లే రహదారిలో చిలుక వాగు బ్రిడ్జి నిర్మాణం తర్వాత మూల మలుపుల రోడ్డుపైకి చెట్ల కొమ్మలు రావడం వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ఇరుకుగా ఉన్న రహదారిలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజా ప్రతినిధులు, అధికారులు,చెట్ల కొమ్మలు తొలగించి ఆర్టీవో నిర్దేశించిన హెచ్చరికలు రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేయాలని వాహనదారులు ప్రజలు కోరుకుంటున్నారు.