చర్లపల్లి డివిజన్ లో పర్యటించినా.

ఎమ్మెల్యే బండారి

కాప్రా నేటి ధాత్రి మార్చ్: 28

చర్లపల్లి డివిజన్లలో కాలనీలోని సమస్యలపై విస్తృత పర్యటన చేసిన ఉప్పల్
ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి 
చర్లపల్లి డివిజన్ చక్రిపురం ,టీచర్స్ కాలనీ ,సీతారాం కాలనీ,మారుతి కాలనీ ,గాంధీ నగర్ , సోనియా గాంధీ నగర్ ఫేస్ 2 కాలనీ లలో ఎమ్మేల్యే బండారి లక్ష్మారెడ్డి ,కాలనీ వాసులు ,ప్రెసిడెంట్లతో కలిసి పర్యటించారు.
స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో కొన్ని చోట్ల డ్రైనేజీలు సమస్య , ప్రధానంగా మంచినీటి పైప్ లైన్ సమస్యలను గుర్తించి ,అలాగే సీసీ రోడ్ ఎర్పాటు చేయలని కాలనీ వాసులు కొరగా
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కార మార్గాన్ని చూపుతామని
నియోజకవర్గ పరిధిలోని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారమందిస్తామని
సంబందిత అధికారులతో మాట్లాడి ఈ సమస్యలను తప్పక నెరవేరుస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకుడు మహేష్ గౌడ్ , డివిజన్ అధ్యక్షులు డప్పు గిరిబాబు ,చక్రిపురం కాలనీ ప్రెసిడెంట్ రాఘవ రెడ్డి , బుచ్చిరెడ్డి ,టీచర్స్ కాలనీ ప్రెసిడెంట్ మహిపాల్ రెడ్డి,
సీతారామ్ కాలనీ ప్రెసిడెంట్ ఆశోక్ ముదిరాజ్ ,గాంధీ నగర్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీశైలం ,మారుతి నగర్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్ ,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version