నేటి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు నిర్వహించే దివ్యాంగుల ఆసరా పెన్షన్ దారుల ఆత్మీయ సమ్మేళనాన్ని జిల్లాలోని దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని భారత జాగృతి దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ కుమారస్వామి గౌడ్ ఒక ప్రకటనలో కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, భూపాలపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి బస్వరాజ్ సారయ్యలు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని అన్నారు. గత 15ల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగులను ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చేసిందనీ, సీఎం కేసీఆర్ సహకారంతో నేడు దివ్యాంగులందరం ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నామన్నారు. కావున జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి జిల్లాలోని దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version