మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నామినేషన్ కు

భారీగా బయలుదేరిన కొల్చారం మండలం బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు…

కొల్చారం (మెదక్) నేటిధాత్రి :-

మెదక్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా కొల్చారం మండలం నుంచి అన్ని గ్రామాల నుండి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున బయలుదేరారు. ఈ సందర్భంగా పోతన శెట్టిపల్లి చౌరస్తా వద్ద కొల్చారం మండల యువత విభాగం అధ్యక్షుడు తుంకలపల్లి సంతోష్ రావు విలేకరులతో మాట్లాడుతూ కోనాపూర్, పైతర , కొల్చారం, పోతం శెట్టిపల్లి, చిన్నగనాపూర్ వివిధ గ్రామాల నుండి తరలి వెళ్లడం జరుగుతుందని ఆయన అన్నారు. వెంకట్రాంరెడ్డి గెలుపు కోసం కొల్చారం మండలం బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్త లందరము కలిసికట్టుగా పనిచేసి కొల్చారం మండలం నుండి భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తుంకలపల్లి సంతోష్ రావు , రవితేజ రెడ్డి, ఎల్లేశం, మోత్కు మల్లేశం, సీనియర్ నాయకుడు చిట్యాల యాదయ్య, అన్ని గ్రామాల బిఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version