వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన పిఎసిఎస్ చైర్మన్

గణపురం పిఎసిఎస్ చైర్మన్ కన్నేబోయిన కుమార్

గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
గణపురం మండల కేంద్రంలో పిఎసిఎస్ చైర్మన్ కన్నెబోయిన కుమార్ విలేకరులతో మాట్లాడుతూ గణపురం మండలానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 4461 మంది సభ్యులు ఉన్నారని రెండు లక్షల రుణమాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారనిమండలంలో పదకొండు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు రైతులు పండించిన వరి ధాన్యాన్ని సొసైటీ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వరి ధాన్యాన్ని అమ్ముకోవాలని దళారులను బ్రోకర్లను నమ్మి మోస పోకుండా ప్రభుత్వం పిఎసిఎస్ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన మొదటి రకం వరి ధాన్యానికి 2203 రూపాయలు రెండవ రకం వరి ధాన్యానికి 2183 ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లిస్తుందని అన్నారు రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన కేంద్రాలలో వరి ధాన్యాన్ని అమ్మడం వల్ల సొసైటీ అభివృద్ధి చెందుతుందని దీనితో రైతులు అభివృద్ధి చెందుతారని అన్నారు రైతులు అభివృద్ధి చెందితే సొసైటీ అభివృద్ధి చెందుతుందని దీనికి రైతులు సహకరించాలని కోరారు సహకార సంఘం ప్రభుత్వం రైతులకు ఎలక్షన్ కోడ్ వల్ల నిలిచిపోయిన రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు 15 తర్వాత రైతులకు అందే విధంగా బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు మిల్లర్లకు ప్రభుత్వం రైతుల దగ్గర వరి ధాన్యాన్ని కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలనిభూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాలు జారీ చేశారని ఎలాంటి తూకంలో మోసం జరిగినా మిల్లర్లపై తగిన చర్య తీసుకోబడునని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version