జీవుల ప్రాణ,ఆరోగ్య దాతలు ఈ అడవులు

మానవుల ప్రాణవాయువు, ఆహారం,ఆశ్రయం,జీవనోపాధి, ఔషదాలు అందించుటలో వాటి పాత్ర ఆమోగం

విజ్ఞాన దర్శిని జిల్లా అధ్యక్షుడు పెండ్యాల సుమన్

పరకాల నేటిధాత్రి అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా
సమస్త జీవులకు అక్షిజన్,నీరు అందించే చెట్లు,అడవులు మానవుల జీవితంలో బాగమయ్యాయి
ఇట్టి అడవులు తెలంగాణ లో 26,969,54 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నాయి.దేశపు అడవుల విస్తీర్ణంలో రాష్ట్రo 12వ స్థానంలో ఉంది
ఇక్కడి అడవులను వాటి స్వభావాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు
ఉష్ణమండల పొడి ఆకురాల్చే అడవులు
ముళ్ల పొదలతో కూడిన అడవులు
ఉష్ణ మండల తేమ ఆకురాల్చే అడవులుగా గుర్తింపు పొందాయి
ఈ అడవులు రాష్ట భౌగోళిక విస్తీర్ణంలో 24,04 శాతంగా ఉన్నాయి.లీగల్ స్టేటస్ కిందకు వచ్చే అడవులు రిజర్వుడు అడవులు
రక్షిత అడవులు గా రెండు రకాలు
అటవీ చట్టం 1988 ప్రకారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వుడ్ అడవుల,అడవి జంతువులను రక్షిస్తాయి
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1,6 బిలియన్ ల పేద ప్రజలకు ఈ అడవులు ఆహారం ఆశ్రయం, నీరు మందులు అందిస్తున్నాయి.ఈ అడవుల ప్రాముఖ్యత గుర్తించి,వాటి రక్షణ కోసం వాటి ఉపయోగాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించుటకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2012 లో మార్చి 21వ తేదీన అటవీ దినోత్సవం గా ప్రకటించింది
నాటి నుండి ప్రజల్లో అడవులు చెట్ల ప్రాముఖ్యత వివరించుటకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.సమస్త జీవులకు ప్రాణధారం అయ్యే అడవులు నేడు అంతరించిపోవడం ఆందోళన కలిగించే అంశం
అసలు అడవులు లేని జీవ విధానం ఊహించలేము
అడవుల రక్షణ లేకుంటే విపరీతమైన కాలుష్య కోరల్లో మానవ సమాజం నెట్టబడుతుంది.ఉష్ణోగ్రతలు పరిస్థితుల్లో పెనుమార్పులు సంభవించి ఆకలి దప్పికలతో సమస్త జీవులు విగాత జీవులు గా మారే పెను ప్రమాదం సంభవించక ముందే మానవాళి మేల్కోవాలని విరివిగా భాద్యత గా మొక్కలు నాటాలి వాటిని రక్షించాలి
అడవులని,పక్షులు,జంతువులను రక్షించుట ప్రతి ఒక్కరి భాద్యత అవ్వాలి అప్పుడే కాలుష్యం,అనారోగ్యాల నుండి సమస్త జీవుల తో పాటు మానవాళి మనుగడ సాధ్యం అవుతుందని శాస్ర్తియ జ్ఞాన సమాజనిర్మానోద్యమ నాయకుడు పెండ్యాల సుమన్ అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version