??బాధితులకు బకాయిలు చెల్లించాల్సిందే!

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు!

`మోసం చేసిన చిట్ కంపెనీల ఆస్తులు జప్తు చేయాల్సిందే.

`అవసరమైతే ఆ కంపెనీల ఆస్తులమ్మి చెల్లించండి.

`అధికారులకు మంత్రి పోగులేటి ఆదేశం.

`అయినా అధికారులు, చిట్ కంపెనీలు వెతుకుతున్న పక్క దారులు.

`మంత్రి పొంగులేటికి తప్పుడు సమాచారాలతో కంపెనీలకు అధికారుల సహకారం.

`చీట్ చేస్తాం చిట్ కట్టండి!

`జీవోలను కూడా అనువుగా మార్చుకుంటాం!

`పేదలకు మేలుచేసే జీవోను కూడా మా మేలుకు వాడుకుంటాం.

`బాధితుల పేరుతో కూడా మేమే సొమ్ము చేసుకుంటాం.

`బాధితులకు ఉత్త చేతులు చూపిస్తాం.

`నాయకుల చల్లని చూపులు, అధికారుల సంతకాలు మాకే సొంతం.

`మంత్రి చెప్పినా వినం.. యంత్రాంగం మాకు దాసోహం!

`మాటలతో నమ్మిస్తాం.. పేదల కష్టం దోచుకుంటాం.

`అహర్నిశలు కష్టపడండి.. మా జల్సాలకు దాచుకోండి.

`జనం సొమ్ము కమ్మగా తింటాం.. దివాళా తీశామని చెప్పి శట్టర్ మూసేస్తాం.

`అమాయకుల పెట్టుబడితో ఆనందంగా బతుకుతాం సొమ్ములు పెట్టండి.

` చిట్ కు చీట్ తేడా చిన్నది.. మోసం చాలా పెద్దది!

`నమ్మించి చిట్ వేయిస్తారు..చీట్ చేయడానికి వెనుకాడరు.

`తెలంగాణా లో చిట్ కంపెనీల నయా మోసం.

`ప్రజలనే కాదు, ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నారు.

`ప్రభుత్వ ఆదేశాలను యాదేచ్చగా ఉల్లంగిస్తున్నారు.

`ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు.

`అధికారుల అండ దండలతో జనాన్ని నిండా ముంచేస్తున్నారు.

`అమాయకుల జీవితాలను ఆగం చేస్తున్నారు.

`చిట్టిలు కట్టిన పాపానికి వారి జీవితాలలో నిప్పులు పోస్తున్నారు.

`పేదల జీవితాలతో అటలాడుకుంటున్నారు.

`అమాయకుల జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు.

`నమ్మించి నట్టేట ముంచుతున్నారు.

`అధికారుల అండ దండలతో తిమ్మిని బమ్మిని చేస్తున్నారు.

`ప్రభుత్వ ఆదేశాల అమలులో కూడా తీవ్ర అన్యాయం చేస్తున్నారు.

 

హైదరాబాద్, నేటిధాత్రి:                                     

 ప్రజల సొమ్ముంటే అలుసైపోయింది. వారి సొమ్ము దిగమింగడం చిట్ కంపనీలకు అలవాటైపోయింది. ప్రజలను నమ్మించడం, వారి చేత చిట్టీలు కట్టించుకోవడం మోసం చేయడం పరిపాటిగా మారింది. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా తెలంగాణలో అన్ని జిల్లాలో దుర్మార్గపు వ్యాపారం కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ప్రజల అమాయకత్వం, వారి ఆశలను సొమ్ము చేసుకోవడం చిట్ కంపనీలకు అలవాటుగా మారింది. అడిగే వారు లేరు. నిలదీసే వారు లేరు. అన్యాయం అని ఎలుగెత్తేవారు లేరు. చట్టం పట్టించుకోదు. నాయకులు కనికరం చూపరు. మోసపోయిన ప్రజల పక్షాన ఎవరూ మాట్లాడరు. అయ్యోపాపం అని కూడా అనేవారు లేక చిట్ కట్టిన ప్రజలు అరిగోస పడుతున్నారు. కొన్ని దశాబ్ధాలుగా చిట్ కంపనీలు చేస్తున్న మోసాలను గత పాలకులు ఎవరూ అరికట్టలేదు. బాదితుల పక్షాన నిలవలేదు. వారి న్యాయం చేయాలన్న ఆలోచన చేయలేదు. చిట్ బాదితులు పడుతున్న వేధన అర్దం చేసుకోలేదు. వారి గోసను చూసే తీరిక చేసుకోలేదు. దాంతో చిట్ కంపనీల దగా వ్యాపారం కోట్లకు నిర్వాహాకులకు వరమైపోయింది. బాధితులకు శాపమైపోయింది. ఇలా సాగుతున్న మోసానికి మొదటిసారి అడ్టుకట్ట వేసిన ఘనత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి దిక్కింది. కాని ఏం లాభం కొందరు అదికారులు, చిట్ వ్యాపారులతో చేతులు కలిపి మంత్రి ఆదేశాలను కూడా పక్కదారి పట్టిస్తున్నారు. అసలు నిజాలు దాచి మంత్రి పొంగులేటిని కూడా మోసం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి మంత్రి పొంగులేటి బాధితుల పక్షాన నిలిచి, వారి న్యాయం జరగాలని కోరుకున్నారు. రంగంలోకి దిగి చిట్ కంపనీల మోసాలపై దష్టిపెట్టారు. వారి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు బహత్తరమైన జీవో తెచ్చారు. అయినా అదికారుల్లో కదలిక పెద్దగా రాలేదు. చిట్ కంపనీలకు భయం కలగడం లేదు. శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు మంత్రి ఆదేశాలను కూడా ఇంకా తుంగలో తొక్కుతున్నారు. ఎట్టిపరిస్ధితుల్లో ఒక్క బాదితుడు కూడా మళ్లీ కన్నీళ్లు పెట్టుకోవద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆలోచించారు. అనుకున్నదే తడువుగా జీవో జారీ చేశారు. బాదితుల కళ్లలో ఇంత కాలానికైనా ఆనందం చూడాలనుకున్నారు. వారు చెల్లించిన సొమ్మును వారికి దక్కేలా చేయాలనుకున్నారు. ప్రభుత్వం తరుపున జీవో జారీ చేశారు. ఆ జీవోను కూడా చిట్ కంపనీలు వారికి అనువుగా మార్చుకుంటుంటున్నారంటే ఎంత తెలివి మీరిపోయారో అర్దం చేసుకోవచ్చు. ప్రజల నుంచి చిట్ పేరుతో సొమ్మును సేకరించిన ప్రతి చిట్ కంపనీ ఆస్ధులను జప్తు చేసైనా సరే వారికి ప్రతి రూపాయి చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆ జీవో ఏ ఒక్క కంపనీకో, ఏ ఒక్క జిల్లాకో పరిమితమైంది కాదు. కాని అదికారులు అతి తెలివిగా ఆ జీవోను అమలు చేయడంలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. జీవో అమలుకు తూట్లు పొడుతున్నారు. అసలైన బాదితులకు అందాల్సిన సొమ్మును కంపనీలకు చెందిన వ్యక్తుల పేరు మీద చెక్కులు తీసుకుంటున్నారు. తమ వ్యక్తులనే బాదితులుగా చూపిస్తున్నారు. వారికి సొమ్ము చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నారు. అసలైన బాధితులను మళ్లీ, మళ్లీ మోసం చేస్తూనే వున్నారు. అంటే ప్రభుత్వం నేరుగా జీవో జారీ చేసినా దానిని పక్కదారి పట్టించడంలో అదికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. చిట్ కంపనీలకు నేరుగానే మేలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలోని కనకదుర్గ చిట్ కంపనీ నుంచి లబ్దిదారులకు చెక్కులు చెల్లించే విషయం అన్ని జిల్లాలకు పాకింది. దాంతో అన్ని జిల్లాలో వున్న బాదితులంతా వెలుగులోకి వచ్చారు. తమకు న్యాయం జరగాలని రోడ్డెక్కారు. అటు కంపనీల చుట్టూ, ఇటు అదికారుల చుట్టూ తిరుగుతున్నారు. దాంతో ఆ శాఖకు చెందిన ఉన్నతాదికారులు మరో రకమైన ఎత్తు వేశారు. అన్ని జిల్లాకు చెందిన బాదితుల లిస్టును కూడా మళ్లీ వరంగల్ జిల్లాకు చేరవేసేలా శాఖ నుంచి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఇతర జిల్లాల అదికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రజలు వారి వద్దకు వెళ్లి మొర పెట్టుకుంటున్నారు. బాదితులకు సమాదానాలు చెప్పలేక ఇతర జిల్లాల అదికారులు నానా అవస్ధలు పడుతున్నారు. ఈ జిల్లాలో చెల్లించిన సొమ్ము కోసం వరంగల్ జిల్లాకు ఎందుకు వెళ్లాలని ఆయా జిల్లాల అదికారులను ప్రజలు నిలదీస్తున్నారు. పై నుంచి వున్న ఆదేశాలని బాదితులకు చెప్పలేక, వారిని వారించలేక ఇతర జిల్లాల అదికారులు నానా తంటాలు పడుతున్నారు. అయినా ఏ జిల్లాలో మోసపోయిన బాదితులకు ఆ జిల్లాలోనే న్యాయం జరగడం పరిపాటి. కాని ఇతర జిల్లాలకు వెళ్లి అక్కడ వారి గోడును చెప్ప్పుకునేలా ఉన్నతాదికారులు తీసుకున్న నిర్ణయం అందిరికీ విస్మయం కలిగిస్తోంది. ఈ విషయం మంత్రి పొంగులేటి వరకు వెళ్లకుండా అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మూడు జిల్లాలకు చెందిన ఓ డిఐజి పర్యవేక్షురాలిగా నిర్ణయించారు. అసలు ఒక్క డిఐజీని ముప్పై మూడు జిల్లాల పర్యవేక్షణ ఎలా సాద్యమౌతుంది? వరంగల్ జిల్లాలోనే అసలు పూర్తి స్దాయి డిఆర్ లేడు. వరంగల్ జిల్లా డిఆర్‌గా కరీంనగర్ డిఆర్ అదనపు బాధ్యతలు వహిస్తున్నారు. ఆ డిఆర్ ఆద్వర్యంలో చెక్కుల పంపణీ చేయించడం అంటేనే పారదర్శకతను పాతర పెట్టడమే అవుతుంది. అదికారులు చాలా తెలివిగా అటు మంత్రిగారి ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నట్లు కనిపించినా, లోగుట్టును బైటకు పొక్కకుండా చూసుకుంటున్నారు. ఇతర జిల్లాల డిఆర్‌లకు పెద్ద తలనొప్పిని తెచ్చిపెడుతున్నారు. ఇతర జిల్లాల డిఆర్ నుంచి అందాల్సిన చెక్కులు, వరంగల్ ఇన్‌చార్జి నుంచి అందించడమంటేనే అసలైన మోసం దాగి వుంది. ప్రజలను, ప్రభుత్వాన్ని , సాక్ష్యాత్తు మంత్రిని కూడా ఇలా కూడా మోసం చేయగల సమర్ధలు వ్యవస్ధలో వున్నారని తేలిపోయింది. ప్రభుత్వ ఆదేశాలను పక్కాగా అమలు చేయాల్సిన అదికారులు, చిట్ కంపనీలకు తొత్తులుగా మారిపోవడం వల్ల ఇక బాదితులకు న్యాయం ఎలా జరుగుతుంది? పోనీ అన్ని జిల్లాల అదికారులను బాగస్వాములను చేసి, బాదితులకు న్యాయం చేసేలా ఆదేశాలున్నాయా? అంటే అదీ లేదు. ముప్పై మూడు జిల్లాల బాధితుల సమస్యల పరిష్కారం ఒక్క డిఐజీ చేతుల్లో పెట్టడమేమటి? ఆ డిఐజీగా వున్న మూడు జిల్లాలో ఒక్క వరంగల్ జిల్లా ఇన్‌చార్జి డిఆర్ కనుసన్నల్లోనే చెక్కుల పంపణీ కార్యక్రమం జరగడమేమిటి? ఇదేమీ అంతు పట్టని రహస్యం కాదు. కాని బాదితులు అంత దూరం వెళ్లలేక, న్యాయం కోసం రొడ్డెక్కలేక రోదించడం తప్ప ఏం చేయలేరు. పదే పదే పది సార్లు వరంగల్ వెల్లలేరు. పది సార్లు తిరిగినా తమ ఖర్మ ఇంతేనని సరిపెట్టుకుంటారు. ఇదే సమయంలో కంపనీలకు చెందిన వ్యక్తుల పేరు మీద డిపాజిట్ సొమ్మును దోచుకునేందుకు మార్గం పడుతుంది. అలా వరంగల్ జిల్లాలోనే ఒక్క కనకదుర్గ చిట్ కంపనీలోనే కొన్ని వందల మంది బాదితులున్నారు. వారికి అందాల్సిన సొమ్మును ఓ నలుగురికి అందించి, మిగతావన్నీ తమ వ్యక్తుల పేరుతో చెక్కులు జారీ చేసుకున్న వైనం కూడా కనిపిస్తోంది. వరంగల్ జిల్లా కేంద్రంగా వున్న అనేక కంపనీలు, అన్ని జిల్లాల్లోనూ, ఇతర రాష్ట్రాలలోనూ కూడా కంపెనీలు పెట్టాయి. అలా అంతటా చిట్ వ్యాపారాలు మొదలు పెట్టడం, దివాళా తీశామని బోర్డులు తిప్పేయడం పరిపాటిగా మారింది. ప్రజలను ప్రజల సొమ్ముతో మోసం చేయడమే వ్యాపారమైపోయింది. గత పదేళ్ల కాలంలో ఈ మాత్రమైనా న్యాయం జరిగేందుకు ఒక అడుగు ముందుకు పడలేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చూపిన చొరవ మూలంగా ఆ అడుగు పడింది. ఆ అడుగును కూడా సక్రమంగా అమలు చేయకుండా, మంత్రి దష్టికి ఎలాంటి వార్త వెళ్లకుండా అదికారులు జాగ్రత్తపడుతున్నారు. బాదితులు తమ సొమ్మును తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఓ చిన్న ప్రకటన డిఆర్‌లు జారీ చేసి, చేతులు దులుపుకున్నారు. ఆ ప్రకటన ద్వారా కంపనీల డిపాజిట్ సొమ్మును కూడా అప్పనంగా మళ్లీ కంపనీలకు చెందిన వ్యక్తులకు జారీ చేసి మమ అనిపిస్తున్నారు. దీనిపై మంత్రి మరోసారి దష్టిపెడితే అదికారుల అసలు బాగోతం, కంపనీల గుట్టు మరోసారి రట్టవుతుంది. బాధితులకు మరింత న్యాయం జరిగనట్లౌవుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version