చాకలి ఐలమ్మ విగ్రహాన్ని దొంగిలించిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి.

తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ ,& తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్డేపల్లి సారంగపాణి

గణపురం నేటి ధాత్రి

హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జ్యోతి నగర్, దోబీ ఘాడ్ దగ్గర చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి ఐలమ్మ విగ్రహాన్ని దొంగలించడం చాలా హేయమైన చర్య అని తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ & తెలంగాణ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్డేపల్లి సారంగపాణి అన్నారు . ఈ సందర్బంగా సారంగపాణి మాట్లాడుతూ .వీర తెలంగాణ పోరాటంలో క్రియాశీల ఉద్యమాన్ని నిర్వహించిన వీర వనిత తెలంగాణ తల్లిగా గుర్తించబడ్డ చాకలి ఐలమ్మ విగ్రహాన్ని దొంగలించిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి ఐలమ్మ విగ్రహాన్ని పునర్నిర్మాణం జరిపించాలని కోరారు. లేనియెడల అన్ని రజక సంఘాలను కలుపుకొని తెలంగాణ రజక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాల మండలాల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉదృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version