ఆలయ శిల్ప సంపదను భావితరాలకు అందించాలి

జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్

ఆలయం పేరుతో ముద్రించిన బ్యాగుల ఆవిష్కరణ

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో కాకతీయ కలక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళు అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ అన్నారు. కార్తిక మాస ఉత్సవాలలో భాగంగా ఆయన గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయం పేరుతో ముద్రించిన బ్యాగులను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకే తలమానికంగా ఉన్న కోటగుళ్లు ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆలయ శిల్ప సంపదను భావితరాలకు అందించాలన్నారు. ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఆవిష్కరణ అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో కోటగుళ్లు పరిరక్షణ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version