నేటిధాత్రి కధనానికి స్పందన

గ్రామపంచాయతీకి చేరిన మంచినీటి పైపులు
పైపులను తస్కరించిన వారిపై చర్యలు శూన్యం

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో మంచినీటి పైపులు గ్రామపంచాయతీ నుండి ఆటోలో తరలించినట్లు పంపు ఆపరేటర్ రాజయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కి ఫిర్యాదు చేసిన వైనంపై గురువారం నేటిధాత్రిలో వార్త కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తస్కరించిన పైపులను గురువారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయంకు తెప్పించారు. రాజయ్య ఇచ్చిన సమాచారం మేరకే అధికారులు తరలించిన పైపులను వెతికి గ్రామపంచాయతీకి చేర్చడం శుభపరిణామమే కానీ పైపులను తస్కరించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం, రాజయ్యను విధులకు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి అర్థంపడుతుండడం కొసమెరుపు. పైపులను ఎవరు తస్కరించారు, ఎక్కడికి తరలించారు వీటిపై సమగ్రమైన విచారణ జరిపించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version