పదవీ విరమణ పొందిన పోలీసు అధికారిని సత్కరించిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదవీరమణ పొందిన డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ (డి ఎ ఆర్ ) నందు 36 సంవత్సరములు విధులు నిర్వహించి ఈరోజు పదవీ విరమణ చేసిన బి.మోహన్, ఎ ఆర్ ఎస్ ఐ ని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో సిబ్బందితో కలిసి ఘనంగా సత్కరించారు. ఈ రోజుతో తమ సర్వీస్ ను ముగించుకొని పదవీరమణ పొందడం జరిగింది. క్రమశిక్షణతో పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించిన మోహన్ ని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వారికి చెందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరాగ అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు. అనంతరం పదవీ విరమణ పొందిన పోలీసు అధికారిని కుటుంబాల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని తెలిపారు. భవిష్యత్తులో ఏ విధమైన సహాయం కావాలన్నా వెంటనే తమను సంప్రదించాలని వారికి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డీసీఆర్ బీ, డిఎస్పీ రమణా రెడ్డి, ఎఓ శ్రీమతి రుక్మిణి బాయి, రాంరెడ్డి, ఎస్పీ సీసీ, శ్రీను ఆర్ ఐ అడ్మిన్, కృష్ణయ్య ఆర్ ఐ,వెల్ఫేర్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version