ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేయాలి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే విజయసంకల్పయాత్రను మండల ప్రజలు విజయవంతం చేసి మూడోసారి మోడీని ప్రధాని చేయుటకు సహకరించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ పేర్కొన్నారు. నేడు నల్లబెల్లి మండలకేంద్రంలో జరిగే బిజెపి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రూట్ మ్యాప్ ను పార్టీ మండల అధ్యక్షుడు రేవూరి నరసింహ రెడ్డి తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. నేడు ప్రపంచ అగ్రదేశాలకు సరి సమానంగా భారత కీర్తి ప్రతిష్టలను చాటిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ. మరో మారు దేశ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో. బిజెపి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి. మనదేశ సంస్కృతి సాంప్రదాయాలు అభివృద్ధిని కాపాడుకోవాలని ఆయన కోరారు. మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో సంకల్ప యాత్రకు సంబంధించిన సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని మండల ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా సీనియర్ నాయకుడు తడక అశోక్ గౌడ్. జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్. వాణిజ్య సెల్ సభ్యుడు రామకృష్ణారావు. మండల నాయకులు బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి.తడక వినయ్ గౌడ్. పెరుమాండ్ల కోటి, వేముల రాజు.విజయ్ తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version