శివనామ స్మరణతో మార్మోగుతున్న రాజన్న ఆలయం

వేములవాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం

వేములవాడ నేటిధాత్రి

మహాశివరాత్రి పర్వదినం.. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రక ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగి పోతున్నాయి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు.. అలాంటి పరమశివునికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. పరమశివుడు విశ్వవ్యాప్తమైన రోజు మహాశివరాత్రి పర్వదినం. అటువంటి మహాశివరాత్రి పర్వదినం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత ఘనంగా జరుగుతుంది.
వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తజన సందోహంతో, శివనామస్మరణతో మారుమోగిపోతుంది. దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి వేములవాడలో కన్నుల పండుగగా మహా శివరాత్రి జాతర ప్రారంభం అయింది. విద్యుత్ దీపాలంకరణలతో ఆలయాన్ని విశేషంగా ముస్తాబు చేశారు

జాతర ఏర్పాట్లతో వేములవాడ పట్టణం నూతన శోభను సంతరించుకుంది. ఈ రోజు తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయం వద్ద కిటకిటలాడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను నిన్న రాత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. మంత్రి, ప్రభుత్వ విప్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇక మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మహాశివరాత్రి జాతర వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాల నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు. ధర్మగుండంలో కొత్త నీటిని నింపడమే కాకుండా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version