ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం

బిఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నేర్పటి శ్రీనివాస్

మొగుళ్లపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 07

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల, బి ఆర్ ఎస్ ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు నేర్పటి శ్రీనివాస్ మంగళవారం రోజున విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… భూపాలపల్లిలో ఎగిరేది గులాబీ జెండే అని అన్నారు. గండ్ర వెంకట రమణారెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపియ్యాలన్నారు. బిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం కేసీఆర్‌ బీమా ప్రతి ఇంటికి ధీమా, అన్నపూర్ణ పథకం, ఆసరా పెన్షన్‌ 5,016, దివ్యాంగులకు 6 వేల పెన్షన్‌ పెంపు, రైతుబంధు 16 వేలు, ఆగ్రవర్ణ పేదలకు గురుకులాలు, కేసీఆర్‌ ఆరోగ్యరక్షకు రూ. 15 లక్షలు, సౌభాగ్యలక్ష్మి రూ. 3 వేలు మహిళలకు జీవనభృతి, గ్యాస్‌ సిలిండర్‌ రూ. 4వందలకే, మహిళ సమాఖ్యలకు సొంత భవనాలు, నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ నెల 30 న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గండ్ర వెంకటరమణారెడ్డి ని గెలిపించాలని కొరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version