భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్

జంబుల రవీందర్ బిజెపికి రాజీనామా

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ నవంబర్ 07

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రైస్ మిల్ ఓనర్, బిజెపి పార్టీ సీనియర్ నేత జంబుల రవీందర్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామాను జిల్లా అధ్యక్షులు కన్నం యుగంధర్, భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి-సత్యపాల్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు చదువు రామచంద్రారెడ్డిలకు వాట్సాప్ ద్వారా పంపినట్లు తెలిపారు. జంబుల రవీందర్ విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలు కలిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో చేరి విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూ.. 2003లో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం 2014లో వార్డ్ మెంబర్ గా గెలుపొంది పార్టీ పటిష్టతకు కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం పోతుగల్లు ఎంపీటీసీగా అవకాశం కల్పించగా..స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అలాగే భారతీయ జనతా పార్టీలో మండల ఉపాధ్యక్షుడిగా, మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం తన సతీమణి జంబుల రజిత భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. కాగా మంగళవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో భారతీయ జనతా పార్టీకి మండలంలో బిగ్ షాక్ తగిలినట్లు అయింది. జంబుల రజిత-రవీందర్ దంపతులు కాంగ్రెస్ లో చేరడంతో పార్టీ మరింత బలపడేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version