అభిమానానికి వయస్సు అడ్డురాదని చాటిన మాస్టర్ శివాంష్
వేములవాడ నేటి ధాత్రి
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావు గెలుపుకోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గడపగడపకూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని 21 వ వార్డులో వొడ్యాల వేణు-హరిత దంపతుల తనయుడు వొడ్యాల శివాంష్ అనే బుడతడు గులాబీ కండువా ధరించి,జెండా చేతబట్టి,నెత్తిన టోపీ పెట్టి జై తెలంగాణ… జై కేసీఆర్, జై కేటిఆర్ అని నినాదాలు చేయడంతో ప్రచారంలో ఉన్న నేతలంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికిలోనై కొన్ని క్షణాలపాటు నిశ్శబ్దం అలుముకుంది.ఈ సందర్భంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేసి చిన్నోడిని అభినందించారు.గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వేములవాడ పట్టణానికి మంత్రి కేటిఆర్ విచ్చేసినపుడు కూడా ఈ చిన్నోడు ఇదే తరహాలో గులాబి జెండాతో హడావుడి చేయగా సాక్షాత్తుగా మంత్రి కేటిఆర్ సంభ్రమాశ్చర్యాలకు లోనై చిన్నోడిని దగ్గరకు తీసుకొని ఆశీస్సులందించిన సంగతిని నేతలు గుర్తుచేశారు.