కళ్ళ ఎదుటే కబ్జా.. అధికారులకు కనిపించడం లేదా…

కళ్ళ ఎదుటే కబ్జా.. అధికారులకు కనిపించడం లేదా?

◆-: జహీరాబాద్లో బడా భూస్వామి ‘పక్కా స్కెచ్’

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: పట్టణ నడిబొడ్డున విలువైన ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. సుమారు రూ. 50 కోట్ల విలువైన పాల శీత లీకరణ కేంద్రం (MCC) స్థలాన్ని హస్తగతం చేసు కునేందుకు ఓ బడా భూస్వామి సాగించిన ఆక్రమణ పర్వం ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. అధికారుల అండదండలతోనే ఈ దందా సాగుతోం దని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్ద కాలంగా కబ్జా యత్నాలు

సర్వే నంబర్ 147లో 1973లో ఏర్పాటు చేసిన ఈ పాల శీతలీకరణ కేంద్రానికి మొత్తం 3.20 ఎకరాల భూమి ఉంది. దీనికి ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 146లోని తన భూమిని సాకుగా చూపిస్తూ, ఒక వ్యక్తి గత పదేళ్లుగా ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిం చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో (2013లో) ప్రజల నిరసనతో, 2018లో మున్సిపల్
అధికారుల జోక్యంతో ఈ కబ్జా ప్రయత్నాలు విఫల మయ్యాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది అధికారులు మౌనం.. ‘దెయిరీ’ స్కామ్ ఆరోపణలు గతంలో సర్వే నిర్వహించి ఇది ప్రభుత్వ భూమేనని తేల్చిన యంత్రాంగం, ఇప్పుడు మాత్రం కళ్లు మూసుకున్నట్లు వ్యవహరిస్తోంది. సదరు కబ్జాదారుడు ఏ కంగా ప్రభుత్వ స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక భారీ ‘డె యిరీ’ స్కామ్ ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజల ఆగ్రహం: ‘

ఎన్నికల విధుల పేరుతో అధికా
రులు బాధ్యత నుండి తప్పించుకుంటున్నారు. ఎంసీ సీ మేనేజర్ డేవిడ్ మరియు ఇతర ఉన్నతాధికారులు కబ్జాదారులతో కుమ్మక్కయ్యారు. వారి సహకారంతో నే అర్ధరాత్రి పూట ఫెన్సింగ్ పనులు పూర్తయ్యాయి.

మున్సిపల్ చైర్మన్ స్పందించాలి!

కోట్ల విలువైన ప్రజా ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల పరం అవుతుంటే చూస్తూ ఊరుకోబోమని రైతాంగం హెచ్చరించింది. మున్సిపల్ చైర్మన్ వెంటనే స్పందించి, కబ్జాకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకో వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూమిని కాపాడకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రైతులు స్పష్టం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version