నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని నార్లాపూర్ గ్రామం ముంపునకు గురి కాకుండా శాశ్వత ప్రతిపాదికన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశించారు.
మంగళవారం నడికూడ మండలం నార్లపూర్ గ్రామంలోని పెద్దవాగుపై బ్రిడ్జి, చెక్ డ్యామ్,మత్తడి కాల్వను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.నార్లాపూర్ గ్రామం ముంపుకి గురి కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కల్వర్టు ఇరువైపులా,మత్తడి పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.