జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
తెలిపారు. 2025 సంవత్సరం అందరికీ శాంతి, సంతోషం, ఆరోగ్యం, అభివృద్ధి కలిగించాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన చిట్ట చివరి కుటుంబం వరకు చేరేలా అన్ని శాఖల అధికారుల సమిష్టి కృషితో ముందుకు ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాలు ఆనందమయం కావాలని అన్నారు. జిల్లా అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.
అధికారులకు బొకేలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలపడం సహజమని, అయితే వాటికి బదులుగా పేద విద్యార్థులకు ఉపయోగపడేలా నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, ఇతర సామగ్రి ఇవ్వాలని ఆయన సూచించారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే వివిధ శాఖల అధికారులు, తదితరులు బొకేలు, పుష్ప గుచ్చాలకు బదులు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటివి అందించి పేద విద్యార్థులకు చేదోడువాదోడుగా నిలవాలని తెలిపారు. త్వరలోనే వాటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version