వార్షిక తనీఖీల్లో భాగంగా బెల్లంపల్లి ఏసిపి కార్యాలయంను తనిఖి చేసిన సిపి.

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి నియోజకవర్గ
వార్షిక తనీఖీల్లో భాగంగా రామగుండము పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి ఏసిపి కార్యాలయం రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.ఐజి తనీఖీ చేశారు.తనీఖీ లో భాగంగా ఏసిపి కార్యాలయమునకు చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌ కి ఏసీపీ మొక్కను అందజేసి స్వాగతం పలకారు. సాయుద పోలీసులు చేసిన గౌరవ వందనం స్వీకరించి అనంతరం పోలీస్‌ కమిషనర్‌ ఏసిపి కార్యాలయమునకు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు, ఏసిపి అధ్వర్యంలో దర్యాప్తు జరిగిన కేసుల ప్రస్తుత స్థితిగతులపై,గ్రేవ్‌ కేసుల్లో నిందితుల అరెస్టు,దర్యాప్తు జరుగుతున్న తీరును సీపీ ఏసీపీ రవి కుమార్ ని అడిగి తెలుసుకొవడంతో పాటు,పెండింగ్‌లో వున్న ఎస్సీ ఎస్టీ కేసులు, ఇతర గ్రేవ్‌ కేసుల వివరాలకు సంబంధించిన రికార్డులను పోలీస్‌ కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా బెల్లంపల్లి సబ్‌`డివిజినల్‌ పోలీస్‌ అధికారులతో కమిషనర్‌ మాట్లాడుతూ.శాంతి భద్రతల విషయంలో పోలీస్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, నేరాల కట్టడి కొసం అధికారులు సమిష్టిగా సమన్వయము తో మరింత శ్రమించడంతో పాటు, ప్రోయాక్టీవ్ పోలీసింగ్ ఉండాలి. నేరం జరిగిన వెంటనే అధికారులు వేగంగా స్పందించాలని, చట్టాలను అతిక్రమించే చర్యలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితిలో వదలవద్దని, పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏం జరుగుతోందని ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు, ముందస్తూ సమాచార సేకరణ అవరమని నూతన సంవత్సరం లో నేరాల నియంత్రణ, కట్టడికి ముందస్తు ప్రణాళిక తో ఉండాలని క్రైమ్ రేట్ ఇంకా తగ్గించాలని పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు తెలిపారు.నేరాల నియంత్రణకు విసబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ తో పాటు, ఆకస్మిక వాహన తనిఖీ లు నిర్వహించాలని ముందస్తు నేరా నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలనీ సూచించారు.ఈ తనీఖీలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్. బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్. దేవయ్య, బెల్లంపల్లి రూరల్ సీఐ ఆఫజాలోద్దీన్, తాండూర్ సీఐ కుమారస్వామి, మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి,తదితరులు పాల్గోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version